Etala Rajender | హైదరాబాద్ : ఉప్పల్ ప్రెస్క్లబ్లో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అనుచరులు రెచ్చిపోయారు. ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హుజురాబాద్ దళితులపై ఈటల రాజేందర్ అనుచరులు దాడి చేశారు. మీడియా సమావేశాన్ని అడ్డుకున్న వారిని అసభ్య పదజాలంతో దూషించారు. అంతేకాకుండా మీడియా ప్రతినిధుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు. మీడియా లోగోలను, కెమెరాలను ఈటల మద్దతుదారులు ధ్వంసం చేశారు. ప్రెస్ క్లబ్లోని ఫర్నీచర్ను పగులగొట్టి, భయభ్రాంతులకు గురి చేశారు. హుజురాబాద్ దళితులు భయపడి బయటకు వెళ్లిపోయారు. ఈటల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆయన మద్దతుదారులు నినాదాలు చేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈటల అనుచరులపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ దళితులు డిమాండ్ చేస్తున్నారు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఈటెల రాజేందర్ అనుచరుల వీరంగం
తమకు అన్యాయం చేశాడని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హుజురాబాద్ దళితులు.
మా నాయకుడిని విమర్శిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా అంటూ ప్రెస్ క్లబ్ లోనే దౌర్జన్యానికి దిగిన ఈటెల అనుచరులు.
అడ్డుకున్న మీడియా ప్రతినిధులపై దాడి… pic.twitter.com/7OD7b7Zqtd
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2024