యాదాద్రి భువనగిరి : ప్రజలకు సత్వర న్యాయ సేవలందించేందుకే జూనియర్ సివిల్ కోర్టు లు ఏర్పాటుఅవుతున్నాయని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి రామచందర్ రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును జిల్లా ప్రొటోకాల్ జడ్జి రాజశేఖర్ రెడ్డి, హై కోర్ట్ న్యాయమూర్తులు రాజశేఖర్ రెడ్డి, షెమి మక్తార్, వినోద్ లతో కలసి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. కక్షి దారులకు ఈ కోర్టు ఏర్పాటు వల్ల సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజల ఇంటివద్దకే న్యాయ సేవాలందుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్, ఏడీఎం నాగరాజు, చౌటుప్పల్ జూనియర్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ ఉదయ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నిందితుడు రాజు చేతులపై పచ్చబొట్టు ఎవరిదో తెలుసా?
నా చుట్టూ డజన్ల సంఖ్యలో కరోనా సోకినవాళ్లే ఉన్నారు: వ్లాదిమిర్ పుతిన్
Nusrat Jahan: ఎట్టకేలకు తన బిడ్డ తండ్రి ఎవరో చెప్పిన అందాల నటి