హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రి స్కామ్లో ఈడీ దూకుడు కనబరుస్తోంది. మనీలాండరింగ్ కింద రూ.144 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఐఎంఎస్ డైరెక్టర్తోపాటు పలువురు అధికారుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అప్పటి ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, పద్మ, నాగమణి, శ్రీహరిబాబు, రాజేశ్వర్ రెడ్డి తదితరుల ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి.
దేవికారాణికి సంబంధించి మొత్తం రూ.6.50 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసింది. తెలంగాణ, ఏపీ, బెంగళూరు, నోయిడాలో ఉన్న ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు.
తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన 8 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ కేసులో విచారణ ప్రారంభించింది. ఈ స్కామ్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రూ.211 కోట్లపైగా నష్టం వాటిల్లినట్లు అంచనా.