హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ నోటిఫికేషన్ గురువారం విడుదలకానుంది.
అయితే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.