హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాల మేరకు ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తాను అని టీఎస్ఎమ్ఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీఎస్ఎమ్ఎస్ఐడీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా సమర్థవంతంగా పని చేశాను అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తన మీద నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తాను అని చెప్పారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధికి కృషి చేస్తాను అని ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు.