Errolla Srinivas | గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ సృష్టించిన బ్రాండ్ను నాశనం చేశారని విమర్శించారు. పేద విద్యార్థులంటే ఎందుకంత ద్వేషమని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. గురుకులాలు నాశనం కావడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికేనా ఈ కుట్ర అని నిలదీశారు. గురుకలాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. సమస్యలపై విద్యార్థులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.
గురుకులాలపై ఒక్క రోజైనా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసిండా అని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. గురుకుల విద్యార్థుల మరణాలకు సంతాపం తెలిపిండా అని నిలదీశారు. ముఖ్యమంత్రే కదా విద్యాశాఖ మంత్రి.. మరి గురుకులాలు ఎందుకు సర్వనాశనమయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థులంటే ముఖ్యమంత్రికి లెక్కలేదా అని నిలదీశారు. వేల కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ఖర్చుపెడుతున్నారని.. ఎక్కడ ఎన్నికలు జరిగిన కోట్లు కుమ్మరిస్తున్నారని అన్నారు.. గురుకులాల కోసం మాత్రం ఒక్క రూపాయిని కేటాయించడం లేదని ధ్వజమెత్తారు.