హైదరాబాద్ : కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. సామాన్య జనంతో పాటు వైద్యులు సైతం మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో 33 మంది వైద్యులు, సిబ్బందికి వైరస్ పాజిటివ్గా తేలింది. దవాఖానలోని 17 మంది పీజీ వైద్యులకు, ఆరుగురు సీనియర్ రెసిడెంట్ వైద్యులకు కరోనా సోకింది. అలాగే, ఎనిమిది మంది ఫ్యాకల్టీ, ఇద్దరు ఏఆర్టీ వైద్యులకు వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,393 కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో వైరస్తో ఇద్దరు మృతి చెందగా.. 2,319 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,199 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,31,212కు పెరిగింది.