హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లింలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మొహర్రం పండుగ త్యాగం, స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. విశ్వాసం, నమ్మకం కోసం మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవడమే మొహర్రం ప్రత్యేకత అని స్పష్టం చేశారు.
మానవజాతిలో త్యాగం ఎంతో గొప్పదని, మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే ఈ వేడుకకు నిజమైన అర్థమని అన్నారు. ఇస్లాంలో ముఖ్యమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రం స్ఫూర్తిని అనుకరిద్దామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. త్యాగం, శాంతి, న్యాయం వంటి ఆదర్శాలు మనలో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతాయని తెలిపారు.అదే స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కెసిఆర్ గారు సాధించారు అన్నారు. అలాగే సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో అందరికీ అన్నీ విధాల మేలు చేస్తున్నారు అన్నారు.