హనుమకొండ, మార్చి 19: తాను బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. మం గళవారం హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ విసృ్తత స్థాయి సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి ఎర్రబెల్లి పాల్గొన్నారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీలో చేరుతున్న వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. కాంగ్రెస్, బీజేపీలు కావాలనే తనపై విష ప్రచారం చేస్తున్నాయని మం డిపడ్డారు.
కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. వ్యాపారాలు, భూ దందాలు, తప్పుడు పనులు చేసిన నాయకులు పార్టీని వీడుతుంటే కార్యకర్తలు అధైర్యపడొద్దని, పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన చూసి బీఆర్ఎస్ పార్టీని ఓడించి తప్పు చేశామని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఇప్పటికి వరకు 2 పథకాలు మా త్రమే అమలు చేసిందని విమర్శించారు. వంద రోజుల పాలనలో పంటలు ఎండిపోయాయని, కరెంటు రావడం లేదు, తాగునీరు అందడం లేదని ఇందుకు కారణం కాం గ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, వార్ రూంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్రణీత్రావు ఎవరో తెలియదని అన్నారు. ఆయన అమ్మమ్మ ఊరు త మ స్వగ్రామం పర్వతగిరి అయినంత మా త్రాన ఆయనతో సంబంధం ఉన్నట్టా? అని ప్రశ్నించారు.