శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శాలువా కప్పి సన్మానించారు. ముఖ్యమంత్రికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎర్రబెల్లి దయాకర్రావు ఆకాంక్షించారు.