తొర్రూరు, ఫిబ్రవరి 27: . వరంగల్ ఎంపీ కడియం కావ్య వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్అఫీషియో సభ్యురాలిగా ఉండగా, తొర్రూరులో ఓటు వేయడం అప్రజాస్వామికమని, దీనిపై హైకోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ నుంచి కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిని సత్కరించారు. అనంతరం ఎర్రబెల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీఆర్ఎస్ పాలనలోనే తొర్రూరు పట్టణం అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల తీర్పుతో నైతిక విజయం బీఆర్ఎస్కే దకిందని చెప్పారు. తొర్రూరులో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను ప్రస్తుత ఎమ్మెల్యే ఆపివేయించారని ఆరోపించారు. తాము చేసిన పనులపై పోస్టర్లు వేస్తే వాటిని తమవిగా చెప్పుకోవడం అధికార్టీ నేతలకు సమంజసంకాదని హితవుపలికారు. లాటరీ విధానంలో మోసంచేసి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకుందని ఆరోపించారు. దీనిపై కోర్టు త్వరలోనే తీర్పు వెలువరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.