హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోలీహిమ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. హరితహారంతో పాటు పలు పథకాలపై ప్రశంసల వర్షం కురిపించిన ఎరిక్ సోలీహిమ్.. ఇప్పుడు యాదాద్రిపై ట్వీట్ చేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. ఇదొక అద్భుత కళా ఖండం అని ప్రశంసించారు. శ్రీలక్ష్మీ నారసింహ స్వామి ఆలయ ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉందన్నారు. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి ఉందని ఎరిక్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Incredible India 🇮🇳!
Have a glimpse of the Architectural wonder, Sri Lakshmi Narasimha Swamy Temple.Just opened in Telengana, 60 km from Hyderabad.@KTRTRS @TelanganaCMO @tourismgoi @TelanganaCS
— Erik Solheim (@ErikSolheim) March 30, 2022