రాంచీ, మే 2: అమిత్ షా నకిలీ వీడియో కేసుకు సంబంధించి వివిధ రాష్ర్టాల్లో కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేస్తున్నారు. తాజాగా జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతా సస్పెండ్ అయ్యింది. చట్టపరమైన చర్యల్లో భాగంగా జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతాను సస్పెండ్ చేసినట్టు ‘ఎక్స్’ ఈ మేరకు తెలిపింది.
వీడియోను షేర్ చేసిన వారిలో ఉన్నందున జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్కు ఢిల్లీ పోలీసుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేశారు.