సికింద్రాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ‘ఊరు ఊరుకో జమ్మిచెట్టు గుడి గుడికో జమ్మిచెట్టు’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో బాగంగా మచ్చబొల్లారం (సికింద్రాబాదు)లోని సాయిబాబా దేవాలయంలో తెలంగాణ విధ్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్, అధ్యక్షులు తన్నీర్ శ్రీరంగారావు, తెలంగాణ స్టేట్ పుడ్ కమీషన్ మెంబర్ కొంతం గోవర్ధన్ రెడ్డి జమ్మిమొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతి మెంబర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, బిసి కమిషన్ మెంబర్ ఉపేందర్ టీఆర్ఎస్ సిటీ మాజీ కార్యదర్శి అడ్వకేట్ ఆలుగడ్డ అనిల్ కుమార్, జాగృతి లీగల్ సెల్ స్టేట్ అధ్యక్షులు తిరుపతి వర్మ, అడ్వకేటు ఇంద్రసేనారెడ్డి,హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ లాలారాము తదితరులు పాల్గొన్నారు.