మనోహరాబాద్, సెప్టెంబర్ 3: ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కోరారు. ఆదివారం ఎంపీ బడుగుల లింగయ్య యా దవ్, సినీ నటుడు అలీతో కలిసి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్లో ఏర్పాటు చేసిన ‘ఏఐసీఎంటీ బయో ప్రొడక్ట్స్’ పరిశ్రమను ఆయన ప్రారంభించారు.
ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఇండస్ట్రియల్ కారిడార్ కొండాపూర్లో ప్లాస్టిక్ రహిత పరిశ్రమను ప్రారంభించుకోవడం అభినందనీయం అన్నారు. జీవ పదార్థాలతో తయారైన ప్లాస్టిక్ ఉత్పత్తులు సుమారు వంద రోజుల్లో భూమిలో కలిసిపోతాయని ఆయన పేర్కొన్నారు. గతంలో డీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులను ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ ప్రాం తంలోనే పరిశ్రమ ఏర్పాటు కావడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో శాస్త్రవేత్త వీరబ్రహ్మం, పరిశ్రమ నిర్వాహకులు హఫ్రీజ్, షేక్ షరీఫ్, హాసిన్ తదితరులు పాల్గొన్నారు.