హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ): సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విరమణ పొందిన రజత్కుమార్కు ఇంజినీర్లు ఘన వీడ్కోలు పలికారు. హైదరాబాద్లోని జలసౌధలో శుక్రవారం ఆయనకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు సాగునీటిశాఖ ఇంజినీర్లు మాట్లాడుతూ రజత్కుమార్ సేవలను కొనియాడారు. అనంతరం రజత్కుమార్ మాట్లాడుతూ విధినిర్వహణలో సహకరించిన ఇంజినీర్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్, నాగేందర్రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు.