హైదరాబాద్ : మేడ్చల్ గండిమైసమ్మ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం పాలవగా.. మరొకరు గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదంలో గాజులరామారానికి చెందిన మేఘన అనే ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. ఘటనలో సుమనశ్రీ అనే విద్యార్థిని గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.