Heart Attack | మేడ్చల్, మార్చి 3: రోజుకో గుండెపోటు.. అదికూడా యువతకే ఎక్కువ. ఈ మధ్య ని త్యం ఇలాంటి ఘటనలే. ముఖ్యంగా కరోనా తర్వాత యువగుండెకు ముప్పు వాటిల్లుతున్నది. అప్పటివరకూ బాగానే ఉన్నవారు అం తలోనే ఉన్నచోటే కుప్పకూలుతున్నారు. గుం డెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు. మొ న్నటికి మొన్న నిర్మల్లో ఓ యువకుడు పెండ్లి బరాత్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మృతి చెందా డు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లోని ఆరాంఘర్ చౌరస్తాలో ఓ యువకుడు గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చే యడంతో బతికి బట్టకట్టాడు.
ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జి ల్లాలోనూ ఓ యువకు డు గుండెపోటుకు గురికాగా, విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. తాజాగా, మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన సచిన్ (18) కుత్బుల్లాపూర్ మండలం సుచి త్ర ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి నివా సం ఉంటున్నాడు. కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కాలేజీకి వచ్చిన సచిన్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో కారిడార్లో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సమీపంలోని సీఎంఆర్ దవాఖానకు తరలించగా, సచిన్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.