హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్ దేశంలో సంపద నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల అధికారుల మధ్య పారదర్శకత, సామరస్యం ఉండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య పారదర్శకత, అవగాహన లోపించిన కారణంగా దేశవ్యాప్తంగా సుమారు లక్ష కోట్ల రూపాయల విలువచేసే వివాదాలు వివిధ న్యాయస్థానాల్లో నలుగుతున్నాయని వివరించారు.
ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో సోమవారం ‘ఇంజినీరింగ్ కాంట్రాక్ట్స్ – అవాయిడెన్స్ ఆఫ్ డిస్ప్యూట్ ఫర్ హార్మోనియస్ గ్రోత్’ అనే అంశంపై జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల సదస్సులో వినోద్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, భవనాలు, రోడ్లు, బ్రిడ్జీలు వంటి పలు నిర్మాణాల్లో ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్ ప్రధాన భూమిక పోషిస్తున్నారని, కాంట్రాక్టర్స్, ఇంజినీరింగ్ విభాగాల అధికారుల మధ్య పకా ప్రణాళిక, అవగాహన ఉంటే అభివృద్ధి పనులు సాఫీగా ముందుకు సాగుతాయని వినోద్కుమార్ పేరొన్నారు.
ఈ సదస్సులో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి, కార్యదర్శి వెంకటసుబ్బయ్య, కాళేశ్వరం (నీటి పారుదల) ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ ఆర్బిట్రేటర్స్ తెలుగు రాష్ట్రాల చైర్మన్ శ్రీధర్ మోతే, కార్యదర్శి ప్రదీప్రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజజినీర్లు, కాంట్రాక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.