హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఆయా కళాశాలల యాజమానుల ఇండ్లు, కార్పొరేట్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించింది. అర్ధరాత్రి వరకూ ఈ సోదా లు కొనసాగాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీతోపాటు ఎల్బీనగర్లోని కామినేని మెడికల్ కాలేజీ, ఎస్వీఎస్, ప్రతిమ, డెక్కన్, మహేందర్రెడ్డి మెడికల్ కాలేజీ, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, మెడిసిటీ మెడికల్ కాలేజీల్లో ఒకేసారి రైడ్స్ నిర్వహించారు.
మెడికల్ సీట్ల గోల్మాల్ నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తున్నది. సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి ఆయా కళాశాలలకు చెందిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కాలేజీలకు చెం దిన కీలక పత్రాలను, కంప్యూటర్ హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈడీ సోదాల నేపథ్యంలో ఆయా వైద్యకళాశాలలు, వాటి దవాఖానల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అత్యవసర రోగులను తప్ప మరెవరినీ లోపలికి అనుమతించలేదు.