న్యూశాయంపేట, ఆగస్టు 19 : తెలంగాణలో కులవృత్తుల జీవనోపాధికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం హనుమకొండ నగరంలోని హంటర్ రోడ్ అభిరామ్ గార్డెన్లో యాదవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డీ రవీందర్ యాదవ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు విద్యా, ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో రెండో విడుతలో గొర్రెల పెంపకానికి ప్రభుత్వం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. రూ.20 వేల కోట్లతో గొల్ల, కురుమలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించినట్టు చెప్పారు. ఓయూ వీసీ రవీందర్యాదవ్ మాట్లాడుతూ అడుగకముందే వరాలు కురుపించేది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు.