chattisgarh | తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, తెలంగాణ గ్రేహౌండ్స్ భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. అందులో నలుగురు మహిళా మావోయిస్టులు. తెలంగాణ – చత్తీస్గఢ్ సరిహద్దుల్లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి సమీపంలో గల సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ సమీపంలో గల దొరగూడా – పెసర్లపాడు అటవీప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలు కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం అదే అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. బలగాల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవి మార్గంలోకి పరారయ్యారు. కాల్పుల విరమణ అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. పూర్తి వివరాలు అధికారికంగా ధ్రువపడాల్సి ఉంది.