హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఇన్చార్జి ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్)గా గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీ హరిరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) మురళీధర్ వ్యక్తిగత పనులపై ఈ 20న అమెరికా వెళ్లారు. 30న తిరిగి రానున్నారు. దీంతో అప్పటివరకు ఇన్చార్జి ఈఎన్సీగా హరిరామ్ను ప్రభుత్వం నియమించింది.