సోన్, ఏప్రిల్ 4: నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సాకెర గ్రామంలో ఈజీఎస్ నిధులను ‘దారి’ మళ్లించారు. ఉపాధి హామీ కింద రూ. 15 లక్షలతో నూతనంగా సీసీ రోడ్ల పనులు ఎ లాంటి అనుమతులు, గ్రామసభ తీర్మానం లే కుండానే పూర్తిచేశారు. నిధులు దుర్వినియోగం చేసేలా చేపట్టిన పనులు గ్రామస్థులు, వీడీసీ స భ్యుల ఫిర్యాదుతో వెలుగుచూశాయి. గ్రామ అ వసరాలకు కాకుండా స్థానికంగా ప్రైవేటు వ్యక్తు లు, అనుమతి లేని వెంచర్ల యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేలా పనులను చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయా న్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. గ్రామసభ తీర్మానం లేకుండా చేపట్టిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అనుమతులు లేకుండా కొందరికి లబ్ధి చేకూరేలా పనులు చేపడుతుండటం స్థానికంగా విమర్శలకు తావిస్తున్నది. గ్రామంలోని ప్రధాన రహదారుల గుండా మురికినీరు నిల్వ ఉంటున్నది. ఇటువంటి ప్రదేశాల్లో నిర్మించాల్సి ఉండగా.. గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనుమతి లేని లేఅవుట్లలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అదేవిధంగా డ్రైనేజీ పనులను కూడా ఊరి బయట చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయమై పంచాయతీరాజ్ ఏఈ శ్రీధర్ను వివరణ కోరగా.. నిబంధనల ప్రకారమే పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. మరోవైపు గ్రామస్థులు, వీడీసీ సభ్యులు నిర్మల్ కలెక్టర్, జిల్లా, మండలస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో చేపట్టిన పనులపై విచారణ చేయనున్నట్టు తెలుస్తున్నది.