మేడ్చల్, అక్టోబర్30(నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర బదిలీలకు చర్యలు చేపట్టాలని తెలంగాణ నేటివిటీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఏపీ నుంచి సీఎస్ ఇచ్చిన డీవో లేఖ ఆధారంగా ఎన్వోసీ ఇచ్చేవిధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రం అందజేసిన వారిలో అసోసియేషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, అంజయ్య, డాక్టర్ ఆర్ శ్రీనివాస్, బుచ్చయ్య, హరికృష్ణ, పద్మ, మహాలక్ష్మీ, బాలనర్సింహ, మహేందర్రావు, గఫూర్, నరసింహ తదిరతులున్నారు.