హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని, ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణను రూపొందిస్తోందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్లోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యాలయంలో 73 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమతతో కలసి ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగుల కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు తెలంగాణను ఆదర్శంగా నిలిపారన్నారు. రాష్ట్రంలో జోనల్ విధానం పూర్తి అయ్యందన్నారు. నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు ఉద్యోగులు సంయమనం పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి A. సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్, సహదేవ్, రవీందర్ రావు, అరుణ్ కుమార్, వెంకటయ్య, MB కృష్ణ యాదవ్, గండూరి వెంకట్, డా. హరికృష్ణ, లక్ష్మణ్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షులు కృష్ణ మూర్తి గౌడ్, లక్ష్మణ్ గౌడ్, సబిత, సుజాత తదితరులు పాల్గొన్నారు.