హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్తు లైన్లను వెంటనే పునరుద్ధరించాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం టీఎస్ ఎస్పీడీసీఎల్ డిసం పరిధిలో సంభవించిన బ్రేక్ డౌన్ల మీద సంబంధిత ఇంజినీర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా వినియోగదారులకు విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ ఉపవాసాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి, అంతరాయాలు లేకుండా విద్యుత్తు సరఫరా జరిగేట్టు చూడాలని సూచించారు. అనంతరం డిసం రెవెన్యూ, బకాయిల వసూళ్లు, నష్టాల గురించి సమీక్షించారు.