హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) రాష్ట్రప్రభుత్వం పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను 3.646 శాతం పెంచుతూ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
ప్రస్తుతం డీఏ 24.992 శాతం ఉండతగా, తాజా పెంపుతో అది 28.639 శాతానికి చేరింది. పెంచిన డీఏను జూలై 1నుంచి వర్తింపజే స్తారు. జూలై బకాయిలను ఆగస్టు నెల జీతం/పెన్షన్తో కలిపి ఇస్తారు.