భీమదేవరపల్లి, డిసెంబర్ 9: బ్యాటరీ పేలి ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధమైన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. ముత్తారం గ్రామానికి చెందిన కాశిరెడ్డి ఆదిరెడ్డికి ముల్కనూరులో ప్రైవేట్ పాఠశాల ఉంది. ఎప్పటిలాగే పాఠశాలలో సోమవారం వేకువజామున స్కూటీని చార్జింగ్ పెట్టాడు. ఈ క్రమంలో బ్యాటరీ పేలి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది.