మహదేవపూర్/కాళేశ్వరం, అక్టోబర్ 9: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో నిఘా పెంచి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సంలో పాల్గొన్న అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీబరాజ్ను, సమీపంలో ఉన్న అంతర్రాష్ట చెక్పోస్టును పరిశీలించారు. భద్రతా చర్యలపై స్థానిక పోలీసులతో చర్చించి చెక్పోస్ట్ వద్ద నిఘా పెంచాలని సూచించారు. వచ్చే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా మద్యం, నగదు, ఇతర వస్తువులు పంపిణీ చేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.