Election Code | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 6న కోడ్ పూర్తవుతుంది. అంటే.. మొత్తం 80 రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమ ల్లో ఉంటాయి. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు పూర్తవుతున్నా, జూన్ 4న ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రం లో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెండు ఎస్టీ, మూడు ఎస్సీ రిజర్వ్డ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయి మినహా ఇతర అధికారులకు శిక్షణను పూర్తి చేశారు. ఈవీఎంల మొదటి దశ చెకింగ్ పూర్తయింది.
కోడ్ నిబంధనలు ఇవీ..
ఎన్నికల వ్యయంపై..
అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చేసే వ్యయంపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీని కోసం వ్యయ పరిశీలకులు, సహాయ వ్యయ పరిశీలకులు, ఫ్లయింగ్ స్వాడ్లు, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు, వీడియో సర్వేలైన్స్ బృందాలు, వీడియో వీవింగ్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు, మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), జిల్లా వ్యయ పరిశీలన కమిటీ (డీఈఎంసీ)లను ఏర్పాటు చేయనున్నది. వీటితో పాటు రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్, సీబీఐసీ, డీఆర్ఐ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, కమర్షియల్ శాఖ, ఈడీ, ఎన్సీబీ, సీఐఎస్ఎఫ్, ఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ, ఐసీజీ, పోస్టల్, ఏఏఐ, ఆర్బీఐ, ఎస్ఎల్బీసీ, అటవీ శాఖలు అభ్యర్థుల వ్యయంపై తనిఖీలు నిర్వహిస్తాయి.
తనిఖీల నగదుపై..
బ్యాంకుల నుంచి రూ.లక్ష, అంత కంటే ఎక్కువ డ్రా చేసినా, జమ చేసినా ఆ అకౌంట్లపై నిఘా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రూ.10 లక్షల కంటే ఎక్కువగా డ్రా చేస్తే వారి సమాచారాన్ని ఇన్కం టాక్స్ శాఖ అధికారులకు తెలపాలని సూచించింది. పోలీసులు, వివిధ శాఖల అధికారులు చేసే తనిఖీల్లో దొరికిన డబ్బును క్లియర్ చేయడానికి జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. సరైన ఆధారాలు చూపితే ఆ డబ్బును తిరిగి యజమానికి ఇవ్వనున్నారు.
నోడల్ ఆఫీసర్ల కొనసాగింపు
రాష్ట్ర నోడల్ ఆఫీసర్లుగా ఏడీజీలు సంజయ్కుమార్జైన్, మహేశ్ భగవత్ను ఎన్నికల సంఘం కొనసాగించనున్నది. లాఅండ్ఆర్డర్, ఫోర్స్ డిప్లాయ్మెంట్, ఎన్నికల భద్రత వంటి అంశాలకు సంబంధించి నోడల్ ఆఫీసర్ సంజయ్కుమార్ జైన్ను, ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్గా ఏడీజీ మహేశ్ భగవత్ను కొనసాగించనున్నారు.
ఆ 13 నియోజకవర్గాల్లో..రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 13 నియోజకవర్గాల్లో మినహా మిగిలిన 106 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు జరగనున్నది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన 13 నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది.
ఓటరు గుర్తింపుకార్డు లేకుంటే..
ప్రతి ఓటరు ఓటు వేసే సమయంలో ఓటరు గుర్తింపు కార్డును చూపించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లేదంటే 12 రకాల ప్రత్యామ్నాయాల కార్డులను సూచించింది. 1) ఆధార్ కార్డు 2) ఉపాధిహామీ జాబ్ కార్డు 3) బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు జారీచేసే పాస్బుక్లు 4) హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు 5) డ్రైవింగ్ లైసెన్స్ 6) పాన్ కార్డు 7) నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్ జారీచేసే స్మార్ట్ కార్డు 8) పాస్పోర్టు 9) పెన్షన్ డాక్యుమెంట్ 10) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు, 11) ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీచేసే గుర్తింపు కార్డులు 12) యూనిక్ డిసెబిలీటీ ఐడీ కార్డులుఅవసరానికంటే అదనంగా ఈవీఎంలు..
రాష్ట్రంలో బ్యాలెట్ యూనిట్లు 71, 968 అందుబాటులో ఉన్నాయని ఎన్ని కల అధికారులు వెల్లడించారు. అవసరానికంటే 204 శాతం ఎక్కువగా ఉన్నాయ ని వివరించారు. కంట్రోల్ యూనిట్లు 49,692 అంటే 141 శాతం అదనం, వీవీప్యాట్లు 54,353 అంటే 154 శాతం అదనంగా ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ఓటర్లు ఇలా..
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్
మాడల్ పోలింగ్ స్టేషన్లు
పోలింగ్ సిబ్బంది