కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల నియమావళిపై స్పష్టత నిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమాచారం అందించింది. ఉపఎన్నిక జరిగే నియోజకవర్గానికి మాత్రమే నియమావళి వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. కరీంనగర్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ మేరకు ప్రకటించింది.
కాగా, హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ స్టార్క్యాంపెయినర్ల పేర్లు కూడా ఖరారయ్యాయి. 20 మంది నేతల పేర్లతో సిద్ధం చేసిన జాబితాను టీఆర్ఎస్ వర్గాలు ఎన్నికల కమిషన్కు అందించాయి. ఈ జాబితాలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితర నేతల పేర్లు ఉన్నాయి.