Eklavya Model Schools | మహబూబాబాద్ : ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023 -24 ఫలితాలను మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షకు 8,383 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 7,252 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో మొదటి విడతలో 1,347 మంది విద్యార్థులు మోటా అడ్మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం 23 గురుకులాల్లో సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీట్లు సాధించిన విద్యార్థులకు సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 1 నుంచి 10వ తేదీ లోపు ఆయా పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది.
ఈ కార్యక్రమంలో ఏకలవ్య విద్యాలయాల ఓఎస్డీ స్వర్ణలత, డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్, ఆర్సీవో రాజ్యలక్ష్మి ,అకాడమిక్ ఓఎస్డి శ్రీనివాస్, మెహబూబా జిల్లా ఏకలవ్య విద్యాలయాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.