హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఈనెల 30న, మే 6న నడిచే ఎనిమిది రైళ్లను రద్దు చేసినట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు-మాచర్ల, నడికుడి-మాచర్ల, రేపల్లే-సికింద్రాబాద్, కాచిగూడ-నడికుడి రైల్వేస్టేషన్ల ఆధ్వర్యంలో నడిచే రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. లింగంపల్లి నుంచి నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి మీదుగా విశాఖపట్నానికి వెళ్లాల్సిన జన్మభూమి ఎక్స్ప్రెస్ను దారి మళ్లించారు. పగడిపల్లి, కాజీపేట్, విజయవాడ మీదుగా విశాఖపట్నానికి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.