హైదరాబాద్ : ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన పౌరసరఫరాల సంస్థ రాష్ట్రంలో మరో ఎనిమిది జిల్లాలో పెట్రోల్ బంక్ల ఏర్పాటును ముమ్మరం చేసింది. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో సంస్థ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్లను నిర్వహిస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్సింగ్(Chairman Ravinder Singh) వెల్లడించారు. పెట్రోల్ బంక్(Petrol Stations)ల ఏర్పాటుపై నియమించిన కమిటీ ఇందుకు ఆమోదం తెలిపిందన్నారు.
వరంగల్, వనపర్తి, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, సిద్దిపేట, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఈ పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంస్థ ఆదాయాన్ని(Income) పెంచేందుకు సంస్థ కృషి చేస్తుందని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై ఆధ్వర్యంలో జిల్లాకో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు.
తొలి విడతలో 9 జిల్లాల్లో కరీంనగర్ , రంగారెడ్డి, మేడ్చల్ , సంగారెడ్డి, కొత్తగూడెం, మేడ్చల్ , ఖమ్మం, జగిత్యాల , మెదక్ జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇక మిగిలిన జిల్లాల్లోనూ వీలైనంత త్వరగా పెట్రోల్ బంక్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.