ములుగు, మే 31 (నమస్తేతెలంగాణ) : ఎనిమిది మంది మావోయిస్టులు శనివారం ములుగు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్-మహారాష్ట్రకు చెందిన వారికి ప్రభుత్వ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందించినట్టు ఎస్పీ తెలిపారు.
లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ సభ్యుడు దొర్పెట్టి మిర్గు, ఏరియా కమిటీ సభ్యురాలు మడవి టిడో, ఏరియా కమిటీ సభ్యుడు మిడియం బీమాతో పాటు సభ్యులు ఉయిక అనిత, మడకం కమలేశ్, సోయం భీమే, మడవి మడక, మడవి ఇడుమ ఉన్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.