హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ తార్నాకలోని ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) ఆవరణ నుంచి పోలీసులను ఉపసంహరించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించడంపై నిర్ణయం తీసుకునేలా చీఫ్ జస్టిస్కు నివేదించాలని హైకోర్టు సూచించింది.
ఈ మేరకు జస్టిస్ సూరేపల్లి నంద శుక్రవారం హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేశారు.