హైదరాబాద్ : హైకోర్టు న్యాయవాదుల(High court advocates) సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్(Planning board vice chairman) బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. హైకోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో వినోద్ కుమార్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
హైకోర్టులోని మెడికల్ డిస్పెన్సరీ(Medical Dispensary)ని అప్గ్రేడ్ చేసి వైద్య సిబ్బందిని నియమించాలని, లైబ్రరీ నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన శిక్షణ పొందే న్యాయవాదులకు స్టాండింగ్ కౌన్సిల్(Standing councill)గా అవకాశాలు కల్పించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ మంజూరు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ సూచించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు చెంగల్వ కళ్యాణ్ రావు, కార్యదర్శి దేవేందర్, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.