హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో ఉద్యోగుల ఎన్నో సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యం లో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. దసరా పండుగను పురస్కరించుకొని యేటా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ వేడుకకు ఉద్యోగులంతా కుటుంబ సమేతంగా హాజరుకావాలన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని, స్వరాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలను సహృదయంతో పరిష్కరించారని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ మమత, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఇతర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.