హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ రిటైర్డ్ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ అంశాలను దశలవారీగా పరిషరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవంలో 90 ఏండ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ప్రజారవాణా వ్యవస్థ మేలు కోసం రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, ప్రజల సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం, సంస్థ పరిరక్షణ.. ఈ మూడు అంశాలే ప్రాధాన్యాలుగా సంస్థ ముందుకెళ్తుందని స్పష్టం చేశా రు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నంబర్వన్ సంస్థగా మార్చేలా ప్రభుత్వం అన్ని రకాలు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అనంతరం సజ్జనర్ మాట్లాడుతూ.. రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులకు సంస్థపైనా ప్రేమ, అభిమానం ఎకువగా ఉంటుందని, పదవీ విరమణ పొందాక కూడా ఆర్టీసీ బాగుకోసం పరితపిస్తుంటారని అన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగవేందర్రావు, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, సెక్రటరీ విజయ్కుమార్, జాయింట్ సెక్రటరీ సీతరాంబాబు, ట్రెజరరీ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.