మహేశ్వరం, మార్చి 18 : దేవాలయాల అభివృద్ధికి కృషిచేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవునిగుట్ట, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు సంబంధించిన భూములను టీఎస్ఐఐసీ చైర్మన్ నర్సింహ్మరెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాలయాల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందని ఆమె అన్నారు.
దేవాలయానికి సంబంధించిన భూములు కబ్జా కాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. దేవాలయానికి సంబంధించిన భూములను మార్కింగ్ చేసి ఫెన్సింగ్ వేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు బాధావత్ రవినాయక్, బూడిద తేజస్విని, రెడ్డిగళ్ల సుమన్, సప్పిడి లావణ్య ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.