సూర్యాపేట : ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్(Rice bonus) అంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ బోగస్ అని తేలిపోయింది. బోనస్ అందరికీ కాదని, సన్నవడ్లకు మాత్రమేనంటూ తాజాగా ప్రకటించి దొడ్డురకం వడ్లు పండించే రైతులకు ఆ పార్టీ ధోకా ఇచ్చింది. అది కూడా రానున్న వానకాలం సీజన్ నుంచి మాత్రమేనని తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు.
సన్నవడ్లకే ఇస్తామని ప్రకటించడంపై సరర్త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో దొడు వడ్లకు బోనస్ 500 కల్పించాలని నాగారం బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం(Effigy Burn) చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) వ్యతిరేకంగా నినాదులు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చరకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.