హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని కింగ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన యజమానులు, సంస్థల ఆఫీసులు, సంబంధిత వ్యక్తుల ఇండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు చేశారు. ఉదయం నుంచి ఏ డు ప్రాంతాల్లో సోదాలు చేపట్టి.. లెక్క కు చూపని రూ.76.5 లక్షల నగదు, రూ.1.5 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, పలు డిజిటల్ పరికరాలు, బ్యాంకు పాస్బుక్లను స్వాధీనం చేసుకున్నా రు.
ఫెమా నిబంధనలకు విరుద్ధంగా యూఏఈ, యూకే సహా పలు విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనే స మాచారం మేరకు సోదాలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ హవాలా నెట్వర్క్ ద్వారా అక్రమంగా విదేశీ మారకద్రవ్యంలోనూ కింగ్స్ గ్రూప్ కంపెనీల పాత్ర ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సో దాల్లో అనేక కోట్ల రూపాయల విలువై న దేశీయ, అంతర్జాతీయ హవాలాకు సంబంధించిన పత్రాలు, బినామీ ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకొన్నట్టు వివరించారు. ఈ కేసు విచారణలో ఉన్నదని.. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.