రాయిపూర్, ఏప్రిల్ 2: కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను మోదీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై ఉసిగొల్పడంపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నదని విమర్శించారు. పూర్తి మెజారిటీ ఉన్న తమ ప్రభుత్వంపై ఇన్నాళ్లు కన్నెత్తి కూడా చూసేందుకు సాహసం చేయలేని బీజేపీ, ఇప్పుడు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి ప్రయత్నిస్తున్నదంటూ ఆయన ఆదివారం ఆరోపించారు. ఈడీ దాడులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని విమర్శించారు. లిక్కర్ కేసుకు సంబంధించి నెల రోజులుగా తమ రాష్ట్రంలోని పలుచోట్ల దాడులు చేస్తున్న ఈడీ ఇంతవరకు ఆ దాడులతో ఏమి సాధించిందో కనీసం వెల్లడించలేదని అన్నారు.