హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్కు (Navdeep) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసింది. ఈ నెల 10న హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. నార్కోటిక్ బ్యూరో (TSNAB) కేసు ఆధారంగా ఈడీ నోటీలు జారీచేసినట్లు తెలుస్తున్నది.
సెప్టెంబర్ 14న టీఎస్ న్యాబ్ అధికారులు బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లు, ఓ దర్శకుడితోపాటు నలుగురి వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా నిందుతులతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్టయినవారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నారని, తమవద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనను టీన్యాబ్ పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.