హైదరాబాద్/నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డిని చంచల్గూడ జైలులో ఈడీ విచారించింది. చివరి రోజైన మంగళవారం ఐదున్నర గంటలపాటు వారిద్దరిని కలిపి విచారించి..కీలక సమాచారాన్ని రికార్డు చేసుకున్నట్టు తెలిసింది. 11.30 గంటలకే చంచల్గూడకు చేరుకున్న ఈడీ అధికారుల బృందంలోని అసిస్టెంట్ డైరెక్టర్లు సుమిత్గోయెల్, దేవేందర్ సింగ్ మనీలాండరింగ్పై విచారించినట్టు తెలిసింది. ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి బ్యాంకు ఖాతాలు, వాటి వివరాలు.. వచ్చిన డబ్బులు, ట్రాన్స్ఫర్ చేసిన నగదుపై కూలంకషంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విషయమై ఈడీ అధికారులకు సరైన సమాధానం దొరికినట్టు తెలిసింది. వీరిద్దరు ఇచ్చిన వివరాలతోనే ఈడీ అధికారులు సరిపెట్టుకుంటారా? తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? వీరి తర్వాత ఎవరిని విచారించనున్నారు? అనే అంశాలపై సర్వత్ర ఆసక్తి నెలకొన్నది.
బెయిల్ పిటిషన్ల కొట్టివేత
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటివరకు ఈ కేసులో ఒక్కరికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. నల్లగోపుల సురేశ్ (ఏ11) దాఖలు చేసిన పిటిషన్కు మంగళవారం సిట్ కౌంటర్ దాఖలు చేసింది. విచారణ పూర్తి కాలేదని, నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని సిట్ పీపీ క్రిష్ణయ్య కోర్టుకు తెలిపారు. రేణుకరాథోడ్ (ఏ3)తోపాటు ఏ8, ఏ9, ఏ10, ఏ15కు వేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.