హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ సైబర్ స్కాంలపై ఈడీ దృష్టిసారించింది. 50కిపైగా ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ చేపట్టిన విచారణలో 175కిపైగా బ్యాంకు ఖాతాల నుంచి రూ.524 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్టు తేల్చారు. 15 రోజుల్లో వివిధ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును తరలించారు. అలాంటి 580 బ్యాంకు ఖాతాలను విశ్లేషించి సుమారు రూ.32.34 కోట్లను డబ్బును ఫ్రీజ్ చేసి ఈడీ అటాచ్ చేసింది. యూఏఈ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు ఈ తతంగాన్ని మన దేశంలో నడిపిస్తున్నట్టు గుర్తించారు. జస్లీన్ ఎంటర్ప్రైజెస్ కేసులో రూ.70 లక్షలను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.