నాంపల్లి కోర్టులు, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): టీవీ9 మాజీ డైరెక్టర్లు వీ రవిప్రకాశ్, ఎంకేవీఎన్ మూర్తిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీపీ జగన్మోహన్ నాంపల్లిలోని మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదు చేశారు. సెక్షన్ 174, 175 ఐపీసీ ప్రకారం ఈడీకి సహకరించడం లేదని, సమన్లను నిరాకరించినట్టు వివరించారు.
వీరు టీవీ9 డైరెక్టర్లుగా వ్యవహరించిన సమయంలో సంస్థ లావాదేవీలపై ఈడీ చర్యలు చేపట్టింది. నిందితులు కోర్టుకు హాజరుకాకపోవడంతో 317 సీఆర్పీసీ కింద గైర్హాజరు పిటిషన్ను ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. మెజిస్ట్రేట్ 12వ తేదీకి వాయిదా వేశారు.