హైదరాబాద్: ఘన్శ్యాందాస్ అండ్ జ్యువెల్స్ యజమాని సంజయ్ అగర్వాల్ను (sanjay agarwal) ఎన్ఫోర్స్మెంట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. రుణాల పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని మోసం చేసిన కేసులో సంజయ్ అగర్వాల్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మనీలాండరింగ్ చట్టం కింద అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
కాగా, బంగారం స్మగ్లింగ్ కేసులో కోల్కతా ఈడీ సంజయ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో కోల్కతా జైలు నుంచి తీసుకొచ్చిన ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 15 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.