హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): తెలంగాణ నూతన డీజీపీగా రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ అదనపు డీజీ రవిగుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కలిసిన డీజీపీ అంజనీకుమార్ పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలుపడాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది.
ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొంటూ ఆయనను సస్పెండ్ చేసింది. అదనపు డీజీలు మహేశ్ భాగవత్, సందీప్కుమార్జైన్కు నోటీసులు జారీ చేసిం ది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం వల్లే వారిపై చర్యలు తీసుకున్నట్టు ఈసీ తెలిపింది.